Fake News, Telugu
 

భారత వ్యతిరేఖ నినాదాలు చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, వాళ్ళు ఖలిస్తాన్ మద్దత్తుదారులు

0

కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో భారత దేశాన్ని కించపరుస్తూ నినాదాలు చేసారని చెప్తూ ఒక వీడియోని ‘Vhp-Bajarangdal Paloncha’ అనే పేజీ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియో లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా): కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో పాకిస్తాన్ జిందాబాద్, రాహుల్ గాంధీ జిందాబాద్, హిందుస్తాన్ ముర్దాబాద్ అంటున్న దేశ ద్రోహులు

ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో నినాదాలు చేసింది ఖలిస్తాన్ మద్దత్తుదారులు; కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు.

2018 లో జరిగిన ఈ ఘటన మీద అప్పట్లో టైమ్స్ అఫ్ ఇండియా రాసిన ఆర్టికల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లండన్ లో జరుగుతుండగా అనుమతి లేకుండా లోపలికి వచ్చిన నలుగురు ఖలిస్తాన్ మద్దత్తుదారులు రాహుల్ గాంధీ 1984 సిక్కు అల్లర్ల మీద చేసిన వాఖ్యాలను ఖండిస్తూ నినాదాలు చేసారు. ఒక వైపు కాంగ్రెస్ కార్యకర్తలు ‘కాంగ్రెస్ జిందాబాద్’, ‘రాహుల్ గాంధీ జిందాబాద్’ అని అంటుంటే మరోవైపు ఆ నలుగురు ‘హిందుస్తాన్ ముర్దాబాద్’, ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అని నినాదాలు చేసారు.

 

చివరగా, భారత వ్యతిరేఖ నినాదాలు చేసింది ఖలిస్తాన్ మద్దత్తుదారులు; కాంగ్రెస్ కార్యకర్తలు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll