Fake News, Telugu
 

కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ లో ప్లాస్టిక్ బియ్యం లభ్యం అవ్వడం గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు

1

కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ లోని ఒక సూపర్ మార్కెట్ లో ప్లాస్టిక్ బియ్యం లభించాయి అంటూ కొంత మంది ఫేస్బుక్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ లో ఆరోపించిన విషయాల్లో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ లోని ఒక సూపర్ మార్కెట్ లో ప్లాస్టిక్ బియ్యం లభించాయి.

ఫాక్ట్ (నిజం): FSSAI వారు మార్కెట్ లో ప్లాస్టిక్ బియ్యం లభ్యం అవ్వడం గురించి వస్తున్న వార్తలను అవాస్తవాలుగా పేర్కొన్నారు. కరీంనగర్ టౌన్-2 పోలీస్ వారిని సంప్రదించినప్పుడు వారు కూడా ఆ విషయం లో ఎటువంటి నిజం లేదు అని తెలియజేసారు. కావున పోస్టులో చేసిన ఆరోపణల్లో నిజం లేదు.

మన దేశం లోని వివిధ రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం లభించడం గురించి గత కొంత కాలంగా విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. కానీ, అనేక సందర్భాల్లో వాటిని ప్రభుత్వం మరియు FSSAI వారు ఫేక్ న్యూస్ గా పేర్కొన్నారు. FSSAI సంస్థ ప్లాస్టిక్ బియ్యం లభించడం గురించి వస్తున్న వార్తలను అవాస్తవాలుగా పేర్కొంటూ ఒక డాక్యుమెంట్ ని విడుదల చేసింది.

FSSAI సంస్థ బియ్యం యొక్క సహజ లక్షణాల గురించి తెలియజేస్తూ తన అధికారిక వెబ్సైటులో సమాచారాన్ని పెట్టింది. బియ్యం లో స్టార్చ్ మరియు కార్భోహైడ్రాట్స్ ఉండడం చేత వాటి మధ్య ఉండే బంధన మరియు అంటుకునే తత్వం వలన బియ్యం వండాక అన్నాన్ని  ముద్దగా చేస్తే, అందులో ఉండిపోయిన గాలి వల్ల అది ఒక బంతి లాగా బౌన్స్ అవుతుంది అని అందులో పేర్కొన్నారు.

కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ లోని ఒక సూపర్ మార్కెట్ లో ప్లాస్టిక్ బియ్యం లభ్యం అవ్వడం గురించి కరీంనగర్ టౌన్-2 పోలీస్ వారిని సంప్రదించినప్పుడు వారు కూడా ఆ విషయం లో ఎటువంటి నిజం లేదు అని తెలియజేసారు.

చివరగా, కరీంనగర్ జిల్లా జ్యోతినగర్ లో ప్లాస్టిక్ బియ్యం లభ్యం అవ్వడం గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

scroll