Fake News, Telugu
 

బీజేపీ నాయకులు ఒకరినొకరు కొట్టుకుంటున్న పాత వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఘర్షణ పడుతున్నట్టు షేర్ చేస్తున్నారు

0

మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మొదటి జాబితా విడుదల చేయగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘర్షణ పడుతున్నట్టు ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మొదటి జాబితా విడుదల చేయగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘర్షణ పడుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపిస్తున్న ఘటన 2019లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బీజేపీ సమావేశంలో జరిగింది. బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి తన పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ తో వాదనకు దిగుతూ కొట్టుకుంటున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది.  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఒక ప్రాజెక్ట్ పునాది రాయిపై తమ పేర్లు పెట్టుకోవడం కోసం వారు ఈ ఘర్షణకు దిగినట్టు తెలిసింది. ఈ వీడియో కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.   

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘NDTV’ వార్తా సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 06 మర్చి 2019 నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బీజేపీ సమావేశంలో ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్టు వీడియో వివరణలో తెలిపారు. సంత్ కబీర్ నగర్ నియోజకవర్గానికి అప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి తన పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ తో వాదనకు దిగుతూ అతన్ని బూటుతో కొట్టినట్టు ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మిస్తున్న ఒక ప్రాజెక్ట్ పునాది రాయిపై తమ పేర్లు పెట్టుకోవడం కోసం వారు ఈ ఘర్షణకి దిగినట్టు తెలిసింది. 2019లో జరిగిన ఈ ఘర్షణకు సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియోని జాగ్రత్తగా గమనిస్తే, ఘర్షణకు దిగిన నేతల వెనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫోటోలు కలిగిన పోస్టర్ ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి, వీడియోలో ఘర్షణకు దిగిన నేతలు బీజేపీకి చెందినవారని, కాంగ్రెస్ పార్టీకి ఈ వీడియోతో ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇంతకుముందు ఇదే వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు కొట్టుకుంటున్న దృశ్యాలని షేర్ చేసినప్పుడు Factly ప్రచురించిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, బీజేపీ నాయకులు ఒకరినొకరు కొట్టుకుంటున్న పాత వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఘర్షణ పడుతున్నట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

A great believer in democracy, Bharath is convinced that the citizens of this country have a huge role to play in making it successful and effective. But he observes that with misinformation taking centre stage in the socio-political discourse, the very foundation of democracy is at threat. The shared belief that every citizen has the right to factual information without bias is what made Bharath associate with Factly since its inception. He heads Operations and Fact-checking projects at Factly.

Comments are closed.

scroll