Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

పేద ప్రజలకు పంచిన గోధుమ పిండి సంచుల్లో డబ్బులు పెట్టింది తాను కాదని అమీర్ ఖాన్ స్పష్టం చేసారు

0

లాక్ డౌన్ కారణంగా కష్టాలు ఎదురుకుంటున్న ముంబై లోని పేద ప్రజలను ఆదుకోవడానికి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ వారికి పంచే గోధుమ పిండి సంచుల్లో ఒక్కొక్కదాంట్లో రెండు వేల రూపాయుల నగదు పెట్టి పంపించాడనే ఓ వార్త వైరల్ అవుతోంది. అయితే, FACTLY విశ్లేషణ లో అది ఫేక్ అని తేలింది. నటుడు అమీర్ ఖాన్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. అమీర్ ఖాన్ తన ట్వీట్ లో గోధుమ పిండి సంచుల్లో డబ్బులు పెట్టి పంపిస్తుంది తాను కాదని, ఆ వార్త ‘ఫేక్’ లేదా వేరొక వ్యక్తి అలా చేసి దానిని వెల్లడించడానికి ఇష్టపడట్లేదేమో అని అన్నారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. అమీర్ ఖాన్ ట్వీట్ – https://twitter.com/aamir_khan/status/1257165603678240768

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll