Fake News, Telugu
 

2018లో వైజాగ్ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన వీడియోను తన లండన్ పర్యటనకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లండన్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన దృశ్యం అంటూ ఒక వీడియో వైరల్ అవుతోంది. దీనిలో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లండన్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2018లో వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్‌ జగన్‌ను వైసీపీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతిస్తున్నప్పటిది. ఈ వీడియోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి లండన్ పర్యటనకు ఎటువంటి సంబంధం లేదు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వీడియో గురించి వివరాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, ఈ వీడియో 2018లో, విజయనగరంలో ప్రజా సంకల్పయాత్ర సందర్బంగా వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న  వైఎస్‌ జగన్‌ను వైసీపీ కార్యకర్తలు, అభిమానులు స్వాగతం పలుకుతున్న సందర్భంలోది అని తెలిసింది.

ఈ వీడియోని వైరల్ వీడియోతో పోల్చి చూస్తే రెండు వీడియోలు ఒకటే అని తెలిసింది.

ఇటీవల తన వ్యక్తిగత పర్యటన కోసం జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లిన సందర్భంగా ఈ వీడియో వైరల్ అవుతోంది. లండన్ విమానాశ్రయం యొక్క వీడియోలు లభించలేదు, అయితే సీఎంను గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, 2018లో  వైజాగ్ విమానాశ్రయంలో వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన వీడియోను, లండన్ విమానాశ్రయంలోని దృశ్యంగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll