Fake News, Telugu
 

గోమూత్రంతోనే క్యాన్సర్‌ పూర్తిగా తగ్గిపోయిందని కాంగ్రెస్ ఎంపీ చేసిన ఈ వ్యాఖ్యలు ఆశ్రమంలో పని చేసే డ్రైవర్ గురించి చేసినవి

0

గోమూత్రం ఉపయోగించడం ద్వారా తన క్యాన్సర్ తగ్గిందని కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో మాట్లాడిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గోమూత్రం ఉపయోగించడం ద్వారా తన క్యాన్సర్ పూర్తిగా తగ్గిందని కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో మాట్లాడిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో క్లిప్ చేసినది. ఇటీవల మరణించిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, ఆస్కార్ ఫెర్నాండేజ్, 2020లో రాజ్య సభలో మాట్లాడుతూ క్యాన్సర్ అధిగమించిన ఒక వ్యక్తి తనతో పంచుకున్న అనుభవాన్ని వివరించారు. మీరట్ నగరంలోని ఒక ఆశ్రమంలో పనిచేస్తున్న డ్రైవర్, గోమూత్రం ఉపయోగించడం ద్వారా క్యాన్సర్ రోగాన్ని అధిగమించానని తనతో తెలిపినట్టు ఆస్కార్ ఫెర్నాండేజ్ అన్నారు. తనకు క్యాన్సర్ ఉన్నట్టు గాని, గోమూత్రం ఉపయోగించడం ద్వారా తన క్యాన్సర్ తగ్గినట్టు గాని ఆస్కార్ ఫెర్నాండేజ్ ఎక్కడా పేర్కొనలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది. 

పోస్టులో చేసిన క్లెయింకు సంబంధించిన సమాచారం కోసం గుగూల్‌లో వెతికితే, ‘Print’ న్యూస్ సంస్థ 18 మార్చి 2020 నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్‌ ద్వారా కాంగ్రెస్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ ‘గోమూత్రం’ వల్ల క్యాన్సర్‌ను అధిగిమించిన ఒక వ్యక్తి కథని రాజ్యసభలో ప్రస్తావించినట్టు తెలిసింది. హోమియోపతి, భారతీయ వైద్య వ్యవస్థ జాతీయ కమిషన్‌ల ఏర్పాటు కోసం రాజ్యసభలో జరిగిన చర్చలో, ఆస్కార్ ఫెర్నాండెజ్ ‘గోమూత్రం’ ద్వారా తనకు తెలిసిన ఒక వ్యక్తి క్యాన్సర్‌ రోగాన్ని పూర్తిగా అధిగమించారని తెలిపినట్టు ఈ ఆర్టికల్ రిపోర్ట్ చేసింది.

ఆస్కార్ ఫెర్నాండెజ్ 18 మార్చి 2020 నాడు రాజ్యసభలో ఇచ్చిన పూర్తి ప్రసంగం వీడియోని ‘Sansad TV’ న్యూస్ ఛానల్ పబ్లిష్ చేసింది. ఈ వీడియోలోని 2:10 నిమిషాల దగ్గర ఆస్కార్ ఫెర్నాండెజ్, “నేను మీరట్ లోని ఒక ఆశ్రమానికి వెళ్ళాను. తిరుగుప్రయణానికి ఆలస్యం అవ్వడంతో ఆశ్రమం స్వామిజీ నాకు తోడుగా తన డ్రైవర్‌ని పంపారు. నేను ఆ డ్రైవర్‌ని ‘ఆశ్రమంలో ఎందుకు ఉంటున్నావ్? అని ప్రశ్నిస్తే, ‘సర్, నేను ఎటువంటి చికిత్స ద్వార నయం చేయలేదని తీవ్రమైన క్యాన్సర్‌తో భాధపడుతున్నప్పుడు ఈ ఆశ్రమంలో చేరాను. ఈ ఆశ్రమం వారు ఇచ్చిన గోమూత్రం వలన నా క్యాన్సర్‌ పూర్తిగా నయమైంది. అందుకే, నాకు కొత్త జీవితానిచ్చిన ఈ ఆశ్రమానికి జీవితాంతం సేవ చేయాలని నిర్ణయించుకున్నాను’, అని తెలిపినట్టు  పేర్కొన్నారు”. డ్రైవర్ ప్రస్తావనను క్లిప్ చేసి గోమూత్రం వాడటం వలన తన క్యాన్సర్‌ తగ్గిందని ఆస్కార్ ఫెర్నాండెజ్ పేర్కొన్నట్టు పోస్టులోని వీడియోని షేర్ చేస్తున్నారు.

ఆస్కార్ ఫెర్నాండెజ్ 18 మార్చి 2020 నాడు రాజ్యసభలో చేసిన పూర్తి ప్రసంగ పాఠాన్ని ఇక్కడ, ఇక్కడ చదవవచ్చు.  ఆస్కార్ ఫెర్నాండెజ్ కేవలం ఆ డ్రైవర్ తనతో పంచుకున్న అనుభవాన్ని రాజ్యసభలో వివరించారు. తనకు క్యాన్సర్ ఉన్నట్టు గాని, గోమూత్రం ఉపయోగించడం ద్వారా ఆ క్యాన్సర్ తగ్గినట్టు గాని ఆస్కార్ ఫెర్నాండేజ్ ఎక్కడా పేర్కొనలేదు. దీనిబట్టి, పోస్టులో షేర్ చేసిన వీడియో క్లిప్ చేయబడినదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, గోమూత్రం ఉపయోగించడం ద్వారా క్యాన్సర్‌ను అధిగామించానని కాంగ్రెస్ దివంగత ఎంపీ ఆస్కార్ ఫెర్నాండేజ్ రాజ్యసభలో పేర్కొనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll