Fake News, Telugu
 

మరో 50 సంవత్సరాలలో ముస్లింల జనాభా 60%కి చేరుతుందని అసదుద్దీన్ ఒవైసీ అన్నట్టు ఎటువంటి ఆధారాలు లేవు

0

50 సంవత్సరాలలో ముస్లింల జనాభా 60% చేరుతుందని, అప్పుడు హిందువులను ఎవరూ కాపాడలేరని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మరో 50 సంవత్సరాలలో ముస్లింల జనాభా 60%కి చేరుతుంది, అప్పుడు హిందువులను ఎవరూ కాపాడలేరు – హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.

ఫాక్ట్: మరో 50 సంవత్సరాలలో ముస్లింల జనాభా 60%కి చేరుతుందని, అప్పుడు హిందువులను ఎవరూ కాపాడలేరని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల యుపిలో జరిగిన ఒక సమావేశంలో, మోదీ మరియు యోగి అధికారంలో లేనప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారని ఉత్తరప్రదేశ్ పోలీసులని ఉద్దేశించి ఒవైసీ వ్యాఖ్యలు చేసాడు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.           

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, అసదుద్దీన్ ఒవైసీ అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లభించలేదు. ఒకవేళ నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

అక్టోబర్ 2021లో ముస్లింల జనాభా పెరుగుతోందన్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. “ముస్లిములు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని పునరావృతం చేశారని, కాని ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని ఒవైసీ చెప్పారు.”

ఇటీవల యుపిలో జరిగిన ఒక సమావేశంలో, మోదీ మరియు యోగి అధికారంలో లేనప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షిస్తారని ఉత్తరప్రదేశ్ పోలీసులని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసాడు. కానీ, మరో 50 సంవత్సరాలలో ముస్లింల జనాభా 60%కి చేరుతుందని, అప్పుడు హిందువులను ఎవరూ కాపాడలేరని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నట్టు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

చివరగా, మరో 50 సంవత్సరాలలో ముస్లింల జనాభా 60%కి చేరుతుందని, అప్పుడు హిందువులను ఎవరూ కాపాడలేరని అసదుద్దీన్ ఒవైసీ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll