Fake News, Telugu
 

లండన్ పోలీసులు 124 ఇస్లామిక్ రెస్టారెంట్లపై రైడ్ చేసి మూత్రం, మలవిసర్జన కలిపిన ఆహార పదార్ధాలను గుర్తించినట్టు ఎక్కడ రిపోర్ట్ కాలేదు

0

లండన్ నగరంలో 124 ఇస్లామిక్ రెస్టారెంట్లపై పోలీసులు దాడి చేసి పట్టుకుంటే ఆహార పదార్ధాలలో మనిషి మూత్రము మరియు మలము కలిపి అమ్ముతున్నారని విచారణలో తేలింది’, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతోంది. ఇటీవల ముస్లింలు కూరగాయాలపై మూత్రం పోసి అమ్ముతున్నారని ప్రజలు పట్టుకొని కంప్లయింట్ ఇస్తే, పోలీస్ విచారణలో నిజమని తేలిందని, ఇది భారతదేశంలో వెలుగులోకి వచ్చిన ఒక్క కేసు మాత్రమే అని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కూరగాయాలపై ముస్లిం వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన ఇటీవల భారతదేశంలో బయటపడినట్టే, లండన్‌లోని 124 ఇస్లామిక్ రెస్టారెంట్లపై అక్కడి పోలీసులు రైడ్స్ నిర్వహించి మూత్రం మరియు మలవిసర్జన కలిపిన ఆహారాలను గుర్తించారు. 

ఫాక్ట్ (నిజం): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లాలో ఒక ముస్లిం వ్యక్తి కూరగాయాలపై మూత్రవిసర్జన చేసి వాటిని ప్రజలకు అమ్ముతున్న ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ దేశంలో కూడా పలు సార్లు మూత్ర మరియు మలవిసర్జన చేసిన ఆహార పధార్ధాలను ముస్లింలు అమ్మిన ఘటనలు గతంలో భయటపడ్డాయి. కానీ, లండన్ పోలీసులు 124 ఇస్లామిక్ రెస్టారెంట్లపై ఒకేసారి రైడ్ నిర్వహించి మల మరియు మూత్ర విసర్జన కలిపిన ఆహారాలను గుర్తించినట్టు ఇటీవల లేదా గతంలో ఎప్పుడూ రిపోర్ట్ కాలేదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.     

పోస్టులో తెలుపుతున్నట్టు లండన్ పోలీసులు 124 ఇస్లామిక్ రెస్టారెంట్లపై రైడ్లు నిర్వహించి మూత్రం మరియు మలము కలిపిన ఆహార పధార్ధాలను గుర్తించారా అని వెతికితే, అటువంటి వార్తాలను రిపోర్ట్ చేస్తూ ఇటీవల లేదా గతంలో ఎటువంటి ఆర్టికల్ పబ్లిష్ అవలేదని తెలిసింది. లండన్ పోలీసులు ఒకవేళ అంత భారీ  సంఖ్యలో రైడ్లు నిర్వహించి ఉంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి.

బ్రిటిష్ దేశంలోని కొన్ని ముస్లిం రెస్టారెంట్లు మరియు ఐస్‌క్రిమ్ షాప్ ఓనర్లు మూత్రం, మలవిసర్జన కలిపిన ఆహారాలను అమ్ముతూ పట్టుబడినట్టు గతంలో పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ రిపోర్ట్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ చర్యలను ఖండిస్తూ అక్కడి కోర్టులు ఆ ముస్లిం షాప్ ఓనర్లకు జరిమాన మరియు జైలు శిక్షలు కూడా విధించాయి. అయితే, ఇటువంటి  సంఘటనలు కేవలం రెండు లేదా మూడు సార్లు బ్రిటన్లో వెలుగులోకి వచ్చాయి.         

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలి జిల్లాలో ఇటీవల ఒక ముస్లిం కూరగాయల విక్రయదారుడు కూరగాయాలపై మూత్రవిసర్జన చేసి అమ్ముతున్నాడాని ఆరోపిస్తూ ప్రజలు ఆ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించారు. షరీఫ్ అనే కూరగాయల విక్రయదారుడు కూరగాయాలపై మూత్రం పోసి వాటిని ప్రజలకు అమ్ముతుండగా కొందరు యువకులు ఆ దృశ్యాలను వీడియో తీసినట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. పోలీసులు షరీఫ్‌ను అరెస్ట్ చేసి తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి విచారణ జరుపుతున్నట్టు ఈ వార్తా సంస్థలు తెలిపాయి.

చివరగా, లండన్‌ పోలీసులు 124 ఇస్లామిక్ రెస్టారెంట్లపై రైడ్ నిర్వహించి మూత్రం మరియు మలవిసర్జన కలిపిన ఆహారపదార్ధాలను గుర్తించినట్టు ఎక్కడ రిపోర్ట్ కాలేదు.

Share.

About Author

Comments are closed.

scroll