Fake News, Telugu
 

ఫోటోలోని మెదక్ జిల్లా ఆక్సిడెంట్ తాత్కాలిక డ్రైవర్ వల్ల జరగలేదు

1

ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో తెలంగాణ ప్రభుత్వం వారి స్థానంలో తాత్కాలిక డ్రైవర్లను నియమించింది. తాత్కాలిక డ్రైవర్ వల్ల మెదక్ జిల్లాలో తూఫాన్ వాహనాన్ని RTC బస్సు ఢీ కొట్టిందని ఒక ఆక్సిడెంట్ ఫోటోని ఫేస్బుక్ లో కొందరు షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: తాత్కాలిక డ్రైవర్లను పెట్టడం వళ్ళ మెదక్ జిల్లాలో తూఫాన్ వాహనాన్ని ఢీ కొట్టిన RTC బస్సు.

ఫాక్ట్ (నిజం): ఆర్టీసీ కార్మికుల సమ్మె మొదలవ్వక ముందు జరిగిన ఆక్సిడెంట్ ఫోటో పెట్టి తాత్కాలిక డ్రైవర్ వళ్ళ ఆక్సిడెంట్ జరిగినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వార్త గురించి ‘ఈనాడు’ మెదక్ జిల్లా ఎడిషన్ వార్తల్లో వెతకగా, పోస్ట్ లోని ఫోటో సెప్టెంబర్ 28న పెద్దశంకరం పేట మండలం లో జరిగిన ఆక్సిడెంట్ కి సంబంధించినదని తెలుస్తుంది.

ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలు పెట్టింది అక్టోబర్ 4 అర్థరాత్రి నుంచి. అంటే, ఆర్టీసీ కార్మికులు సమ్మె మొదలు పెట్టకముందు ఈ ఆక్సిడెంట్ జరిగింది.

కావున , పోస్టులో పేర్కొన్నట్లు ఫోటోలోని ఆక్సిడెంట్ తాత్కాలిక డ్రైవర్ వళ్ళ జరగలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll