Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

కరోనావైరస్ చికిత్స విధానాలపై మరియు అది వైరస్ కాదు బాక్టీరియా అని ఇటలీ ప్రభుత్వం చెప్పలేదు

0

కరోనావైరస్ పై వచ్చిన కొత్త థియరీలు అని చెబుతూ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ షేర్ అవుతుంది.  ఆ పోస్ట్ లో ఇటలీ వాళ్ళు  కరోనావైరస్ ని,  వైరస్ కాదు బాక్టీరియా అని అంటున్నారని , దాని ద్వారా DIC (disseminated intravascular coagulation) వ్యాధి వస్తుందని, ఆస్ప్రిన్ ద్వారా ఆ వ్యాధిని నయం చేయవచ్చని అంటున్నారని క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కరోనావైరస్, వైరస్ కాదు బాక్టీరియా, మరియు ఆస్ప్రిన్ ఔషధం ఉపయోగించి ఆ వ్యాధిని నయం చేయవచ్చని అంటున్న ఇటలీ.

ఫాక్ట్ (నిజం): కరోనా వైరస్ గురించి పోస్ట్ లో చెప్పిన విషయాలను ఇటలీ వెల్లడించలేదు. ఇందులో చెప్పినవన్నీ తప్పు అని ఇటలీ యొక్క ‘Ministry of health’ వైబ్సైట్ లో చూడవచ్చు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.    

పోస్ట్ లో ఇటలీ COVID-19 ని  వైరస్ కాదు బాక్టీరియా అని అంటుంది అని ఉంది. కానీ, ఇటలీ కి సంబంధించిన ‘Ministero della Salute’ (ఆరోగ్య మంత్రిత్వ శాఖ)  వెబ్సైట్ లో COVID-19 వ్యాధి SARS-COV-2 అనే వైరస్ ద్వారా సోకుతుందని ఉంది. అంతేకాక, ఈ వైరస్ బాక్టీరియా ద్వారా సోకుతుందనే ఆరోపణను తప్పు అని చెప్పారు. కావున, ఇటలీ అంతకు ముందున్న అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎలాంటి క్లెయిమ్ చేయలేదు.

పోస్ట్ లో కరోనా వైరస్ ద్వారా DIC వ్యాధి వస్తుందని, ఆ వ్యాధి వచ్చిన వారికి ఆస్ప్రిన్ 100mg మందు ఇస్తే కోలుకుంటున్నారని ఉంది. కానీ ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో COVID-19  చికిత్స లో ఇంకా ఏ ఔషధం సరైన ప్రభావాన్ని చూపెట్టలేదని మరియు COVID-19 ని నయం చేయడానికి ఏ నిర్దిష్టమైన మందు లేదు అని ఉంది. అందులో రోగుల లక్షణాలని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుందని,  ఆక్సిజన్ థెరపీ, ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్ లాంటి సహాయక చికిత్సలే రోగులకు చేస్తారని, అవి చాలా ప్రభావవంతంగా ఉంటాయని చదవవచ్చు. COVID-19 ఔషధం కోసం అనేక క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి అని ఆ వెబ్సైటు లో ఉంది.  WHO వారి వెబ్‌సైట్‌ లో కూడా అదే విషయాన్ని చదవవచ్చు.

ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ COVID-19 వ్యాధికి ఔషధం కనిపెట్టినట్టు అవుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు.

కరోనా రోగుల కోసం అందుబాటులో ఉంచిన కొన్ని మందులను ఇటాలియన్ మెడిసిన్స్ ఏజెన్సీ – AIFA వెబ్‌సైట్‌ లో చూడవచ్చు. COVID-19 రోగులలో నాన్ స్టెరాయిడల్ యాంటీ-ఇన్ఫల్మె టరీ డ్రగ్స్ (NSAIDS) వాడకం పై 19 ఏప్రిల్ 2020న ‘WHO’ చేసిన సైంటిక్ బ్రీఫ్ లో NSAID లు వాడడం వలన  COVID-19 ఉన్న రోగులలో తీవ్రమైన ప్రతికూల ప్రభావం, దీర్ఘకాలిక  జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అనటానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవు అని ఉంది.

అంతేకాక, కేంద్ర ప్రభుత్వ అధికారిక పౌర సమాచార శాఖ, PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వారు కూడా COVID-19 ని ఆస్ప్రిన్ నయం చేస్తుంది అని ఉన్న మెసేజ్ ఫేక్ అని ట్వీట్ చేసింది.

చివరగా, పోస్ట్ లో చెప్పినట్టు కరోనావైరస్ పై ఇటలీ ఎటువంటి కొత్త వాదనలు చేయలేదు. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll