Fake News, Telugu
 

ఇండియా టీవీ-CNX అక్టోబర్ 2023లో ప్రచురించిన లోక్ సభ ఒపీనియన్ పోల్ సర్వే డాటాను ఇప్పుడు షేర్ చేస్తున్నారు

0

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుండి 10 కి  పైగా స్థానాల్లో గెలవబోతుంది జాతీయ మీడియా సర్వే తెలుపుతుంది అంటూ, న్యూస్24 సర్వే యొక్క స్క్రీన్ షార్ట్ ఒకటి సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) విస్తృతంగా షేర్ అవుతోంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 నుండి 10 కి  పైగా స్థానాల్లో గెలవబోతుందని జాతీయ మీడియా సర్వే తెలుపుతుంది.

ఫాక్ట్(నిజం): ఇది 7 అక్టోబర్ 2023న తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు, బీఆర్ఏస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించిన వీడియో. ఇండియా టీవీ “ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే వారు ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఓటర్ల మానసిక స్థితిని అంచనా వేయడానికి ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ అభిప్రాయ సేకరణను నిర్వహించింది” అనే హెడ్లైన్స్ తో 6 అక్టోబర్ 2023న ఈ డాటా ప్రచురించింది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

న్యూస్24 సర్వే యొక్క స్క్రీన్ షార్టును రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, న్యూస్ 24 యూట్యూబ్ చానెల్లో ఈ సర్వే యొక్క వీడియోకు దారి తీసింది. ఈ వీడియోను పరిశీలించగా, ఇది 7 అక్టోబర్ 2023న ప్రచురించబడిన వీడియో అని తెలుసుకున్నాం. అంటే, ఈ సర్వే 2023 తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరగక ముందు, బీఆర్ఏస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రచురించబడ్డ సర్వే.

వీడియోలో, ఈ డాటా CNX మీడియా సర్వే చేసి ప్రచురించింది అని తెలిపారు. దీనిని ఆధరంగా తీసుకొని తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, ఇవే నంబర్లు ప్రచురించిన ఇండియా టీవీ ఆర్టికల్ ఒకటి కనుగొన్నాము. “ఈరోజు లోక్‌సభ ఎన్నికలు జరిగితే వారు ఎవరికి ఓటు వేస్తారనే దానిపై ఓటర్ల మానసిక స్థితిని అంచనా వేయడానికి ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ అభిప్రాయ సేకరణను నిర్వహించింది” అనే హెడ్లైన్స్ తో 6 అక్టోబర్ 2023న ఈ డాటా ప్రచురించబడినది.

ఇది India TV-CNX ఒపీనియన్ పోల్‌లో మొదటి భాగం అని, ఇందులో 28,309 మంది పురుషులు మరియు 25,941 మంది మహిళలతో సెప్టెంబర్ 20 మరియు అక్టోబర్ 3 మధ్య నిర్వహించిన పోల్ అని తెలుసుకున్నాం ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకున్నాం.

2 ఏప్రిల్ 2024న ప్రచురించబడ్డ ఇండియా టీవీ-CNX ఒపీనియన్ పోల్ సర్వే,“తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఐదు స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది, భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) రెండు సీట్లు, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ -ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం)కి ఒక్క సీటు మాత్రమే దక్కే అవకాశం ఉంది”  అని తెలిపింది.

చివరిగా, ఇండియా టీవీ-CNX అక్టోబర్ 2023లో ప్రచురించిన లోక్ సభ ఒపీనియన్ పోల్ సర్వే డాటాను ఇప్పుడు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll