Fake News, Telugu
 

చంద్రబాబు నాయుడు అయోధ్య రామయ్యను అవమానించినట్లు షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

0

22 జనవరి 2024న జరిగిన అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు, ఆలయంలోకి చెప్పులు వేసుకొని ప్రవేశించి, బొట్టు పెట్టుకోకుండా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు అని చెప్తూ ‘Way2News’ పబ్లిష్ చేసిన వార్త కథనం ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: చెప్పులు వేసుకొని అయోధ్య ఆలయంలోకి ప్రవేశించి, బొట్టు పెట్టుకోకుండా పూజా కార్యక్రమాలలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు-‘Way2News’ వార్తకథనం.

ఫాక్ట్ (నిజం): ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఇదే విషయాన్ని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టం చేసింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు .

వైరల్ పోస్టులో చెప్పిన విధంగా, అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా చెప్పులు వేసుకొని అయోధ్య ఆలయంలోకి ప్రవేశించి, బొట్టు పెట్టుకోకుండా పూజా కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారా అని వెతికితే, ఆయన ఇలా చేసినట్టు రిపోర్ట్స్ ఏవీ లభించలేదు.ఈ క్రమంలోనే ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదని తెలిసింది. ఈ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/d3k3fa) ద్వారా ‘Way2News’లో వెతికితే ఈ సంస్థ 10 ఆగష్టు 2023న “లిస్ట్‌-A క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్లు” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది.

పైగా, Way2News సంస్థ X పోస్ట్ ద్వారా “మా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని వివరణ ఇచ్చింది.

చివరగా, అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అయోధ్య రామయ్యను అవమానించినట్లు షేర్ చేస్తున్న ఈ ‘Way2News’ వార్తా కథనం ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll