Fake News, Telugu
 

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘సౌత్ ఫస్ట్-పీపుల్స్ పల్స్’ ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్

0

రాన్నున 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో YSRCP 121-134 సీట్లు, TDP 21-35 సీట్లు, JSP 02-05 సీట్లు, BJP 01 సీటు గెలుచుకోనున్నాయి అని ‘సౌత్ ఫస్ట్ (South First)’ సంస్థ ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని చెప్తూ పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సర్వే ఫలితాలను రిపోర్ట్ చేస్తున్న’Way2News’ వార్త కథనమంటూ స్క్రీన్ షాట్ ఒకటి కూడా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రాన్నున 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో YSRCPకి 121-134 సీట్లు వస్తాయని “సౌత్ ఫస్ట్-పీపుల్స్ పల్స్” ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ సర్వే ఫలితాలను“సౌత్ ఫస్ట్ పీపుల్స్ పల్స్” విడుదల చేయలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో. ఈ వైరల్ సర్వే ఫలితాల పై 15 మార్చి 2024న ‘సౌత్ ఫస్ట్’ వారి అధికారిక X(ట్విట్టర్) ద్వారా స్పందిస్తూ“ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి సౌత్ ఫస్ట్, పీపుల్స్ పల్స్ ప్రీ-పోల్ సర్వే ఫలితాలంటూ ఒక ఫేక్ సర్వే రిపోర్ట్ ప్రచారం అవుతుంది. ఆంధ్రాకు సంబంధించి సౌత్ ఫస్ట్, పీపుల్స్ పల్స్ ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు ఎన్నికల సర్వే నిర్వహించలేదు. సౌత్ ఫస్ట్ పేరును దుర్వినియోగం చేస్తున్న ఈ చిత్రం ఫేక్” అని స్పష్టం చేసింది. అలాగే,ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా స్పష్టత ఇచ్చింది కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ క్లెయిమ్ గురించి తగిన కీవర్డ్స్ ఉపయగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ సర్వే ఫలితాలను “సౌత్ ఫస్ట్” విడుదల చేయలేదు అని తెలిసింది. ఈ వైరల్ క్లెయిమ్ పై 15 మార్చి 2024న సౌత్ ఫస్ట్ తమ అధికారిక X(ట్విట్టర్)లో స్పందిస్తూ (ఆర్కైవ్డ్ లింక్) “ 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకి సంబంధించి సౌత్ ఫస్ట్, పీపుల్స్ పల్స్ ప్రీ-పోల్ సర్వే ఫలితాలంటూ ఒక ఫేక్ సర్వే రిపోర్ట్ ప్రచారం అవుతోంది. ఆంధ్రాకు సంబంధించి సౌత్ ఫస్ట్, పీపుల్స్ పల్స్ ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు ఎన్నికల సర్వే నిర్వహించలేదు. సౌత్ ఫస్ట్ పేరును దుర్వినియోగం చేస్తున్న ఈ చిత్రం ఫేక్” అని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీన్ని బట్టి 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘సౌత్ ఫస్ట్- పీపుల్స్ పల్స్’ ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలు విడుదల చేయలేదు అని తెలుస్తుంది.

అలాగే, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి YSRCPకి 121-134 సీట్లు వస్తాయని “సౌత్ ఫస్ట్- పీపుల్స్ పల్స్” ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేసింది అని రిపోర్ట్ చేస్తున్న ‘Way2News’ వార్తకథనం స్క్రీన్ షాట్ కూడా వైరల్ అవుతోంది. ఈ వార్త కథనం పైన ఉన్న ఆర్టికల్ లింక్ (https://way2.co/44s2sk) ద్వారా ‘Way2News’లో వెతికితే “త్వరలో టీడీపీలోకి మంత్రి జయరాం? ” అనే టైటిల్‌తో ప్రచురించిన అసలైన వార్త దొరికింది.

ఈ వార్త వైరల్ అవడంతో, ‘Way2News’ సంస్థ X(ట్విట్టర్) పోస్ట్ ద్వారా స్పందిస్తూమా లోగోను ఉపయోగించి కొందరు తప్పుడు సమాచారాన్ని #MetaGroups లో ప్రచారం చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది మరియు ‘అటాచ్ చేసిన పోస్ట్’ వైరల్‌గా మారింది” అంటూ ఈ వార్త కథనం ఫేక్ అని స్పష్టత ఇచ్చారు. దీన్ని బట్టి ‘సౌత్ ఫస్ట్- పీపుల్స్ పల్స్’ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని ‘Way2News’  కూడా ఎలాంటి కథనాన్ని ప్రచురించలేదు అని నిర్థారించవచ్చు.

చివరగా, 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘సౌత్ ఫస్ట్- పీపుల్స్ పల్స్’ ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్.

Share.

About Author

Comments are closed.

scroll