Fake News, Telugu
 

ఏపీ సీఎం జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు అంటూ ఒక క్లిప్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఒప్పుకున్నారు అని చెప్తూ వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో “అభివృద్ధి లేదు కేవలం సంక్షేమమే, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజలకి వెళ్ళాయి, అభివృద్ధి అనేది శూన్యం, అభివృద్ధి మీద ఏ విధమైన దృష్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు” అని అంబటి రాంబాబు మాట్లాడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఏపీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని చెప్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో క్లిప్ చేసినది. ఈ వైరల్ వీడియో క్లిప్ యొక్క పూర్తి వీడియో 15 ఏప్రిల్ 2024న ‘NTV’ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పబ్లిష్ చేసింది. వాస్తవంగా, ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటూ వస్తున్న విమర్శలను అంబటి రాంబాబు తప్పు పట్టారు. ఈ వీడియోలో అంబటి మాట్లాడుతూ “అభివృద్ధి లేదు కేవలం సంక్షేమమే, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజలకి వెళ్ళాయి, అభివృద్ధి అనేది శూన్యం, అభివృద్ధి మీద ఏ విధమైన దృష్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు అనేది పచ్చి అబద్ధం, అభివృద్ధి చూడగలిగితే కనిపిస్తుంది” అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోలో తెలుగు న్యూస్ ఛానల్ ‘NTV’ లోగో కలిగి ఉండటం మనం గమనించవచ్చు. దీని ఆధారంగా ఈ వైరల్ వీడియో గురించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇవే దృశ్యాలు కలిగిన పూర్తి నిడివి గల వీడియోని 15 ఏప్రిల్ 2024న ‘NTV’ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో “Question Hour With Minister Ambati Rambabu | YCP | Ntv ” అనే శీర్షికతో పబ్లిష్ చేసినట్టు తెలిసింది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు  టైంస్టాంప్ 01:13:14 వద్ద మొదలై, టైంస్టాంప్ 01:13:33  వద్ద ముగుస్తాయి అని తెలిసింది. వాస్తవంగా, ఈ చర్చా కార్యక్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ “అభివృద్ధి లేదు కేవలం సంక్షేమమే, జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు రెండు లక్షల డెబ్బై కోట్ల రూపాయలు ప్రజలకి వెళ్ళాయి, అభివృద్ధి అనేది శూన్యం, అభివృద్ధి మీద ఏ విధమైన దృష్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు అనేది పచ్చి అబద్ధం, అభివృద్ధి చూడగలిగితే కనిపిస్తుంది” అని అన్నారు. దీన్ని బట్టి పూర్తి వీడియోలోని కొంత భాగాన్ని క్లిప్ చేస్తూ అంబటి రాంబాబు, వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అని అన్నట్లు అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు. వాస్తవంగా, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటూ వస్తున్న విమర్శలను అంబటి రాంబాబు తప్పు పట్టారు.

చివరగా, ఏపీ సీఎం జగన్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఏపీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు అంటూ ఒక క్లిప్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll