Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియోలో ముస్లింల కోసం పాలు ఇచ్చే ఆవును తన్నడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని మమతా బెనర్జీ అనలేదు

0

“ముస్లింల కోసం పాలు ఇచ్చే ఆవును తన్నడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని మమతా బెనర్జీ అంటున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ముస్లింల కోసం పాలు ఇచ్చే ఆవును తన్నడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని మమతా బెనర్జీ అంటున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియోలో ముస్లింల కోసం పాలు ఇచ్చే ఆవును తన్నడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని మమతా బెనర్జీ అనలేదు. ఈ వీడియో 25 మే 2019న, 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ,”నేను ముస్లింలకు మద్దతుగా పని చేస్తా, కదా? నేను అక్కడికి (ఇఫ్తార్ విందుకు) వందసార్లు వెళ్తాను. ‘జే గోరు దుధ్ దే తర్ లాథియో ఖేతే హోయి; (పాలు ఇచ్చే ఆవు యొక్క తన్నులకు కూడా సిద్ధంగా ఉండాలి)” అని అన్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా,  వైరల్ వీడియో యొక్క అధిక నిడివి గల వీడియో యూట్యూబ్‌లో లభించింది. ఈ వీడియోను మీడియా సంస్థ ‘NDTV’ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 26 మే 2019న షేర్ చేసింది. ఈ వీడియో టైం స్టాంప్ 01:38 వద్ద నుండి వైరల్ వీడియోలోని దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ వీడియోలో, మమతా బెనర్జీ మాట్లాడుతూ, “నేను ముస్లింలకు మద్దతుగా పని చేస్తా, కదా? నేను అక్కడికి (ఇఫ్తార్ విందుకు) వందసార్లు వెళ్తాను. ‘జే గోరు దుధ్ దే తర్ లాథియో ఖేతే హోయి; (పాలు ఇచ్చే ఆవు యొక్క తన్నులకు కూడా సిద్ధంగా ఉండాలి), నేను ఇంతకు ముందు చాలా ఇఫ్తార్ కార్యక్రమాలకు హాజరయ్యాను – అందులో కొత్త ఏమీ లేదు. నేను గతంలో వెళ్ళినట్లు రికార్డులు ఉన్నాయి. ఆహ్వానిస్తే వెయ్యి సార్లైనా వెళ్తాను. ఎవరు పిలిచినా వెళ్తాను.” అని అన్నారు (బెంగాలీ నుండి తెలుగులోకి అనువదించగా). వాస్తవంగా, ఈ మీడియా సమావేశంలో ఆమె పాలు ఇచ్చే ఆవు యొక్క తన్నులకు కూడా సిద్ధంగా ఉండాలి అని అన్నారు, ఎక్కడా ముస్లింల కోసం పాలు ఇచ్చే ఆవును తన్నడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని అనలేదు. ఈ వీడియో వివరణ ప్రకారం, ఈ వైరల్ వీడియో 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశానికి సంబంధించినది.

దీని ఆధారంగా తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ మీడియా సమావేశానికి సంబంధించిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 25 మే 2019న, 2019 లోక్ సభ ఎన్నికల ఫలితాలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ మే(2019) నెలాఖరులో నిర్వహించే ఇఫ్తార్ విందుకు మీడియాను ఆహ్వానిస్తూ మీడియాతో,“నేను ముస్లింలకు కోసం పని చేస్తా, కదా? నేను అక్కడికి (ఇఫ్తార్ విందుకు) వందసార్లు వెళ్తాను. ‘జే గోరు దుధ్ దే తర్ లాథియో ఖేతే హోయి; (పాలు ఇచ్చే ఆవు యొక్క తన్నులకు కూడా సిద్ధంగా ఉండాలి)” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

చివరగా, ఈ వైరల్ వీడియోలో ముస్లింల కోసం పాలు ఇచ్చే ఆవును తన్నడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని మమతా బెనర్జీ అనలేదు.

Share.

About Author

Comments are closed.

scroll