Fake News, Telugu
 

శ్రీరాముడి చిత్రం కలిగి ఉన్న రెండు రైలు ఇంజిన్‌లను చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో AI ఉపయోగించి రూపొందించబడింది

0

శ్రీరాముడి చిత్రం కలిగి ఉన్న రెండు రైలు ఇంజన్లను చూపిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ ఫోటోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: శ్రీరాముడి చిత్రం కలిగి ఉన్న రెండు రైలు ఇంజిన్‌లను చూపిస్తున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): శ్రీరాముడి చిత్రం కలిగి ఉన్న రెండు రైలు ఇంజిన్‌లను చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో AI ఉపయోగించి రూపొందించబడింది. ఈ ఫోటోను మొదట @the_rail_pilot అనే యూజర్ 26 మే 2025న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు, ఈ ఫోటో యొక్క వివరణలో ఈ ఫోటో AI ఉపయోగించి రూపొందించిందని స్పష్టం చేశారు. అలాగే  HIVE వంటి పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ కూడా ఈ ఫోటో AI-జనరేటెడ్ ఫోటో అని స్పష్టం చేశాయి. అయితే, 2024లో భారత రైల్వేలు మార్చి 2024లో న్యూ గౌహతి షెడ్‌కు చెందిన డీజిల్ రైలు ఇంజిన్‌ (WDP4D 40603) పై శ్రీరాముని రూపాన్ని చిత్రించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే, ఈ ఫోటోలో ‘The Rail Pilot’ అనే వాటర్‌మార్క్‌ను ఉండటం మనం చూడవచ్చు. దీని ఆధారంగా, ఇంటర్నెట్‌లో వెతికితే ఇదే వైరల్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ‘@the_rail_pilot ‘అనే యూజర్ 26 మే 2025న షేర్ (ఆర్కైవ్డ్ లింక్) చేసినట్లు మేము గుర్తించాము. ఈ ఫోటో యొక్క వివరణలో ఈ ఫోటో AI ఉపయోగించి రూపొందించిందని స్పష్టం చేయబడింది.

ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ AI ఉపయోగించి రూపొందించబడిన ఇలాంటి పలు రైలు ఇంజిన్‌ల ఫోటోలను కూడా షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ APJ అబ్దుల్ కలాం, వంటి పలువురు ప్రముఖల చిత్రాలు కలిగి ఉన్న  పలు రైలు ఇంజిన్‌ల ఫోటోలను మనం చూడవచ్చు. ఈ ఫోటోల వివరణలో కూడా ఇవి AI ఉపయోగించి రూపొందించినవి అని స్పష్టం చేశారు.

అలాగే Hive, wasitAI, Sightengine, AI OR NOT, వంటి పలు AI-జనరేటెడ్ ఇమేజెస్ డిటెక్టింగ్ టూల్స్ ని ఉపయోగించి ఈ వైరల్ ఫోటోను పరిశీలించగా, ఈ వైరల్ ఫోటో 98.6% AI-జనరేటెడ్ ఫోటో కావచ్చని Hive ఫలితాన్ని ఇవ్వగా, ఈ ఫోటో 90% AI-జనరేటెడ్ ఫోటో కావచ్చని Sightengine ఫలితాన్ని ఇచ్చింది. అలాగే wasitAI, AI OR NOT కూడా ఈ వైరల్ ఫోటో AI- జనరేటెడ్ కావచ్చని ఫలితాన్ని ఇచ్చాయి (ఇక్కడ, ఇక్కడ).

మార్చి 2024లో ప్రచురితమైన రిపబ్లిక్ టీవీ కథనం ప్రకారం, భారత రైల్వేలు మార్చి 2024లో న్యూ గౌహతి షెడ్‌కు చెందిన డీజిల్ లోకోమోటివ్ (రైలు ఇంజిన్‌ WDP4D 40603) పై శ్రీరాముడి రూపాన్ని చిత్రించాయి. అలాగే  పలువురు సోషల్ మీడియా యూజర్స్ కూడా శ్రీరాముడి చిత్రం కలిగి ఉన్న ఈ డీజిల్ రైలు ఇంజిన్‌ వీడియోను షేర్ చేశారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

భారత రైల్వేలు పలు డీజిల్ రైలు ఇంజిన్‌లపై అమరవీరులైన భారతీయ సైనికుల పేర్లను ప్రదర్శిస్తోంది (ఇక్కడ, ఇక్కడ)

చివరగా, శ్రీరాముడి చిత్రం కలిగి ఉన్న రెండు రైలు ఇంజిన్‌లను చూపిస్తున్న ఈ వైరల్ ఫోటో AI ఉపయోగించి రూపొందించబడింది.

Share.

About Author

Comments are closed.