Fake News, Telugu
 

షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ ప్రజలకి 40 కోట్ల విరాళం ఇవ్వలేదు.

0

పుల్వామా బ్లాస్ట్ సంఘటన తర్వాత ఫేస్బుక్ లో కొన్ని పేజీలు కొంత మంది ప్రముఖుల మీద ద్వేషపూరిత ఫోటోలు మరియు వీడియోలు పోస్ట్ చేస్తున్నాయి. అలంటి పోస్టుల్లో ఒకటి షారుఖ్ ఖాన్ కి సంబంధించినది. తన దేశ భక్తిని ప్రశ్నిస్తూ ఒక పోస్ట్ ని ‘ సుల్తాని అంజిరెడ్డి ’ అనే అతను ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజముందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్ధాం.

క్లెయిమ్ (దావా):షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ కి 40 కోట్లు విరాళం ఇచ్చాడు

ఫాక్ట్ (నిజం): 2017 లో పాకిస్తాన్ లో గ్యాస్ టాంకర్ పేలినప్పుడు షారుఖ్ ఖాన్ 40 కోట్లు విరాళం ఇచ్చాడు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. ఆ సమయం లో వచ్చిన ఇండియా టీవీ ఆర్టికల్ ప్రకారం షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ ప్రజల కోసం ఎలాంటి సహాయం చేయలేదు.

చివరగా, పోస్ట్ లో చెప్పినట్టుగా షారుఖ్ ఖాన్ పాకిస్తాన్ ప్రజలకి 40 కోట్ల విరాళం ఇవ్వలేదు.

Share.

About Author

Comments are closed.

scroll