Fake News, Telugu
 

రాబోయే అమావాస్య సందర్భంగా భర్త క్షేమం కోరుతూ పసుపు కొమ్మును కట్టిన తాడును మెడలో వేసుకోమని చిన్న జీయర్ స్వామి చెప్పలేదు

0

ఈరోజు సాయంత్రం లోపు పెళ్లి అయిన ఆడవారు తమ భర్త క్షేమం కోరుతూ 9 పోరలతో ఉన్న దారాన్ని పసుపు కొమ్ము కట్టి పసుపు రాసి తాడును మెడలో వేసుకుని అమావాస్య వెళ్ళిన తర్వాత పసుపు తాడును తీసి వేయవలెను. ఎందుకు అంటే రాబోయే అమావాస్య గడ్డు అమావాస్య కనుక అని చిన్న జీయర్ స్వామి చెప్పినట్టు సోషల్ మీడియా లో చాలా మెసేజ్ లు చలామణీ అవుతున్నాయి. కానీ, FACTLY విశ్లేషణ లో అదొక ఫేక్ మెసేజ్ అని తేలింది. చిన్నజీయర్ స్వామి గారి అధికారిక వెబ్సైటు లో ఆ మెసేజ్ ని ఖండిస్తున్నట్లుగా వారు పెట్టారు. చిన్న జీయర్ స్వామి అలాంటి సూచనా ఏమీ జారీ చేయలేదని కూడా స్పష్టం చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. చిన్నజీయర్ స్వామీ వెబ్సైటు – https://chinnajeeyar.org/beware-of-fake-messages-on-social-media/

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll