మోదీ ప్రధానమంత్రి అయ్యాక కూడా దేశంలో పలు సందర్భాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి

మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఒక్క బాంబు పేలుడు కూడా జరగలేదని అర్ధం వచ్చేలా క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఒక్క బాంబ్ బ్లాస్ట్ కూడా జరగలేదు.

ఫాక్ట్ (నిజం): మోదీ ప్రధానమంత్రి అయ్యాక కూడా దేశంలో పలు సందర్భాలలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఉదాహారణకి 2019లో జరిగిన పుల్వామా దాడి, 2016లో జరిగిన ఊరి దాడి, ఇంకా జమ్మూ కాశ్మీర్, బెంగాల్, బెంగుళూరు మొదలైన ప్రాంతాలలో కూడా బాంబు దాడులు జరిగినట్టు ప్రభుత్వం లోక్ సభలో జవాబు రూపంలో చెప్పింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

2014లో మోదీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పటి నుండి ఇప్పటి వరకు దేశంలో బాంబు పేలుళ్లు, టెర్రరిస్ట్ దాడులు జరిగాయి. ఉదాహారణకి, కొన్ని బాంబ్ పేలుళ్ల సంఘటనలు కింద చూద్దాం.

మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారత్ లో జరిగిన ఉగ్ర దాడులకు సంబంధించి FACTLY ఇంతకు ముందు రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, మోదీ ప్రధానమంత్రి అయ్యాక కూడా దేశంలో పలు సందర్భాల్లో బాంబు పేలుళ్లు జరిగాయి.