ఈ వీడియో లో నిర్మల సీతారామన్ గారు పాదాభివందనం చేస్తున్నది అభినందన్ తల్లి గారికి కాదు

‘వింగ్ కమాండర్ అభినందన్ తల్లి గారికి పాదాభివందనం చేసిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతరామన్..!!’ అంటూ ఒక వీడియోని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఓసారి  విశ్లేషిద్దాం.

క్లెయిమ్ (దావా): వీడియో లో నిర్మల సీతారామన్ గారు పాదాభివందనం చేస్తున్నది అభినందన్ తల్లి గారికి అనడం.

ఫాక్ట్ (నిజం): నిర్మల సీతారామన్ గారు పాదాభివందనం చేస్తున్న మహిళ అమరవీరుడు అజిత్ ప్రధాన్ తల్లి హేమ్ కుమారి గారు. కావున ఆమె వింగ్ కమాండర్ అభినందన్ తల్లి డాక్టర్ శోభా వర్తమాన్ గారు కాదు.

గూగుల్ సెర్చ్ లో ఈ విషయం గురించి వెతికినప్పుడు , మార్చ్ 4, 2019 న డెహ్రాడూన్ లో జరిగిన  ఈవెంట్ లో నిర్మల సీతారామన్ గారు ఒక జవాను తల్లిగారికి గౌరవపూర్వకంగా  పాదాభివందనం చేసారు అంటూ The Pioneer మరియు The Indian EXPRESS లో ప్రచురితం అయిన కథనాలు లభించాయి. మరింత సమాచారం కోసం వెతికినప్పుడు ట్విట్టర్ లో BJP MLA Ganesh Joshi గారు ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పెట్టిన ట్వీట్  ఒకటి లభించింది.ఆ ట్వీట్ లో ఆయన ‘ డెహ్రాడూన్ లో జరిగిన ఒక ఈవెంట్ లో  నిర్మల సీతారామన్ గారు అమరవీరుడు అజిత్ ప్రధాన్ తల్లి హేమ్ కుమారి గారికి  గౌరవపూర్వకంగా పాదాభివందనం చేసారు’ అంటూ హిందీ లో ట్వీట్ చేసారు.

చివరగా, వీడియో లో రక్షణ శాఖ మంత్రి  నిర్మల సీతారామన్ గారు పాదాభివందనం చేస్తున్నది అభినందన్ తల్లి గారికి కాదు.